న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిలో వేగంగా ప్రబలిన డెల్టా వేరియంట్ తాజా మ్యుటేషన్ డెల్టా ప్లస్ ఆందోళనకరమైనదని ఇంకా నిర్ధారణ కాలేదని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ అన్నారు. డెల్టా ప్లస్ పై తాము లోతైన అధ్యయనం చేసి దీని గురించి ఎక్కువ తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఇక సెకండ్ వేవ్ వ్యాప్తి మందగించిందని, వ్యాధి సంక్రమణ రేటు చాలా తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వైరస్ కట్టడికి కొవిడ్-19 నిబంధలను ప్రజలు మరింత జాగ్రత్తగా పాటించడం అవసరమని తెలిపింది. ప్రజలు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కోరారు.