ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 12 : ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన హరితహారం పథకం ఏడేండ్ల కింద వానకాలంలో ప్రవేశపెట్టింది. ఆరు విడు తలుగా ఉత్సాహంగా కొనసాగుతూ ఏడో విడుతకు సన్నద్ధమవుతుంది. ఈ ఏడాది మండ లంలో సుమారు ఐదు లక్షల మొక్కలు నాటేందుకు యంత్రాంగం ప్రత్యేకంగా కృషిచేస్తున్నది. వానలు కురుస్తున్నందున హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. అటవీయేతర ప్రభుత్వ భూములు, పాఠశాలలు, కళాశాలలు, రహదారులు, కాలిబాటలు, ప్రభుత్వ కార్యాలయాలు, శ్మశాన వాటి కలు, ప్రభుత్వ ఖాళీస్థలాల్లో మొక్కలు నాటేందుకు మండలంలోని అన్ని గ్రామాల్లో అంతా సిద్ధం చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందున ఉపాధిహామీ కూలీలతో మొక్కలు నాటేందుకు గుంతలను తీయిస్తున్నారు. హరితహారంలో భాగంగా మండలంలో 14 పంచాయతీల్లో ని ర్వహిస్తున్న నర్సరీలతో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో కర్ణంగూడ, ఎలిమినేడు గ్రామాల్లో నర్స రీల్ల్లో టేకు, వేప, కానుగ, జామ, మామిడి, బాదం, బత్తా యి, తుమ్మ, ఎర్రచందనం, గందం, ఈత, అల్ల నేరేడు, తులసితో పాటు పలు రకాల మొక్కలను నాటేందుకు సిద్ధ్దం గా ఉంచారు.
సిద్ధంగా ఉన్న మొక్కలు..
ఈ ఏడాది గ్రామాల్లోని నర్సరీ లో 1.80లక్షల మొక్కలు సిద్ధం గా ఉన్నాయి. అలాగే, అటవీ శాఖ ఆధ్వర్యంలో కర్ణంగూడ, ఎలిమినేడు గ్రామాల్లో నిర్వహిస్తున్న నర్సరీల్లో 2.80లక్షల మొక్కలు సిద్ధ్దంగా ఉన్నాయి. మొక్కలను నాటే కార్యక్రమం జులై మొదటి వారంలో ప్రారం భించే అవకాశాలున్నాయి. 2015లో ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ఇప్పటికే ఆరు విడుతలు విజయవంతం పూర్తిచేసి అధికారులు ఏడో విడుత కోసం సిద్ధమవుతున్నారు.
గుంతలు సిద్ధం..
హరితహారంలో భాగంగా ఈ ఏడాది ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ కూలీల ద్వారా గుం లు తీసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఖాళీస్థలాలు, శ్మశాన వాటికలు, పాఠశాల లు, పంచాయతీ ఆవరణలు, రహదారుల ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల్లో మొ క్కలు నాటేందుకు గుంతలను తీయిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి
ఏడో విడుత హరితహారంలో భా గంగా మండలంలోని వివిధ గ్రా మాల్లోని నర్సరీల్లో 1.80లక్షల మొక్కలు సిద్ధంగా ఉంచాం. ప్రభుత్వం ఆదేశించిన వెం టనే మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే మండలంలోని అన్ని గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను సిద్ధంగా ఉం చాం. వర్షాలు సమృద్ధిగా కురిసిన వెంటనే నాటించేం దుకు చర్యలు తీసుకుంటున్నాం.
-ఎంపీడీవో మహేశ్బాబు, ఇబ్రహీంపట్నం