డ్రైరన్కు ఏర్పాట్లు పూర్తి చేయాలి

- కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, జనవరి7: జిల్లాలో డ్రైరన్ కార్యక్రమ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ హరిచందన వైద్యాధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కొవిడ్-19 టీకా డ్రైరన్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 11ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా దవాఖానలో డ్రైరన్ నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి కేంద్రంలో 3గదులను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి ఒక వ్యాక్సినేటర్, నలుగురు వ్యాక్సినేషన్ సహాయకులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించాలన్నారు. ప్రతి కేంద్రంలో 25 మంది ఆశ కార్యకర్తలకు డ్రైరన్ నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జయచంద్రమోహన్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.శైలజ, డా.రంజిత్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- క్రిప్టో కరెన్సీల్లో రికార్డు: బిట్ కాయిన్ 6% డౌన్.. ఎందుకో తెలుసా!
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో