గిరిజన బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలి

నారాయణపేట టౌన్, డిసెంబర్ 31 : బెస్ట్ అవైలెబుల్ పాఠశాలల్లో 2021-22కి గానూ 3, 5, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం నారాయణపేట జిల్లాకు చెందిన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హరిచందన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతా ల వారీగా వార్షిక ఆదాయం రూ. లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల వారీగా వార్షిక ఆదాయం రూ.2లక్షలు మించరాదన్నారు. దరఖాస్తు ఫారాలు నేటి నుంచి 8వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మహబూబ్నగర్ వారి కార్యాలయంలో ఉచితంగా లభిస్తాయని, పూర్తి చేసిన ఫారాలను అదే తేదీ సాయంత్రం 5గంటల లోగా కార్యాలయంలో సమర్పించాలన్నారు.
16న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాకు మొత్తం 5 సీట్లను కేటయించామని, 3వ తరగతిలో లంబాడా బాలికలకు 1, జనరల్ 1, ఎరుకల 1 కేటాయించారని, 5వ తరగతిలో లంబాడా జనరల్ 1, 8వ తరగతిలో లంబాడా జనరల్ 1 సీట్లను కేటాయించామన్నారు. ఈ అవకాశాన్ని గిరిజన బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
తాజావార్తలు
- ఉగ్రవాదానికి మూలకారకులు వారే : భద్రతా మండలిలో ఇండియా
- దీదీకి నడ్డా కౌంటర్ : అధికారంలోకి రాగానే రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు
- మీ మాజీ సీఎం చెప్పులు మోయడంలో నిపుణుడు..
- రాహుల్.. మీకు మత్స్యశాఖ ఉన్న విషయం కూడా తెలియదా?
- 15 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత
- ఉప్పెన దర్శకుడి రెండో సినిమా హీరో ఎవరో తెలుసా?
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు