Narayanpet
- Dec 30, 2020 , 00:40:52
VIDEOS
‘గిరి వికాసం’ సద్వినియోగం చేసుకోవాలి

నారాయణపేట : జిల్లాలోని గిరిజన రైతులు ‘గిరి వికాసం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన కోరారు. మంగళవారం కలెక్టరేట్ చాంబర్లో ‘గిరి వికాసం’ పథకంపై కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ పథకంలో గిరిజన రైతులు పొలాల్లో బోరు వేసుకోవడానికి అలాగే మోటర్ పంపు సెట్ బిగించుకోవడానికి, కరెంట్ కనెక్షన్ వంటి మూడు సదుపాయాలను వంద శాతం సబ్సిడీతో ఇవ్వ డం ఇవ్వనుట్లు తెలిపారు. నారాయణపేట జిల్లాకు కేటాయించిన టార్గెట్ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోని గిరిజన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా అధికారులు వంద శాతం టార్గెట్ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీటీడీవో శ్రీనివాస్, ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్డీవో కాళిందిని, వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- విపక్షాల..అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి
- అభివృద్ధే లక్ష్యంగా కృషి చేయాలి
- గుట్టను మలిచి.. తోటగా మార్చి..
- అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
- ఎమ్మెల్సీ ఎన్నికకు దిశానిర్దేశం
- టీఆర్ఎస్కే ఓట్లడిగే హక్కుంది
- సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట
- సకల హంగులతఓ నందిగామ
MOST READ
TRENDING