నేరేడుచర్ల, జూన్ 4 : కరోనా కట్టడి కోసమే అన్ని గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు నేరేడుచర్ల ఇన్చార్జి ఎంపీడీఓ విజయ కుమారి తెలిపారు. మండలంలోని పెంచికల్దిన్నె, సోమారం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్లను తాసీల్దార్ సరితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అన్ని సౌకర్యాలతో కేంద్రాలను ప్రారంభించామని, కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఐ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్లూరులో సర్పంచ్ పల్లెపంగ నాగరాజు ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించగా, ఆయా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, సర్పంచులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్ఐ ప్రవీణ్, పెంచికల్దిన్నె సర్పంచ్ సుంకరి వాణీశ్రీరామ్మూర్తి, పెంచికల్దిన్నె వైద్యాధికారి హరికిషన్, కార్యదర్శులు శేఖర్, శ్రీను, అరుణ పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలన
కోదాడ రూరల్ : పట్టణ పరిధి కొమరబండ జడ్పీ ఉన్నత పాఠశాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఐసొలేషన్ కేంద్రంలో ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.నిరంజన్, డా.శైలజ, రూరల్ ఎస్ఐ వై.సైదులు, టీఆర్ఎస్ నాయకులు మామిడి రామారావు, ఆరోగ్యశాఖ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లక్షణాలు ఉన్న వారు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి
పాలకవీడు : జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్న వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎంపీడీఓ జానయ్య సూచించారు. మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో శుక్రవారం కొవిడ్ నిర్ధారణ పరీక్షలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల వివరాలను ఇన్చార్జి వైద్యాధికారి డాక్టర్ ఆరిఫ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో కొవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. పాలకవీడు మండలంలో ప్రజలకు కరోనా వస్తే అధికారులను సంప్రదించి నేరేడుచర్ల మండల కేంద్రంలోని రామాపురం రోడ్డులో పాత మరియానంద పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీఓ దయాకర్, ఏపీఓ మధు, ఈసీ సందీప్రెడ్డి పాల్గొన్నారు.
కూలీలకు కరోనా పరీక్షలు
మునగాల :మండల కేంద్రం, మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు శుక్రవారం వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా కట్టడిలో భాగంగా పని ప్రదేశంలో ఉపాధి హామీ కూలీలకు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.