బ్రస్సెల్స్ : 12-15 సంవత్సరాల్లోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ వేసేందుకు యూరోపియన్ కమిషన్ శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఇంతకు ముందు అమెరికా, కెనడా ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేశాయి. ఇటీవల యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) 12-15 ఏళ్లలోపు పిల్లలకు టీకా వేసేందుకు ఆమోదం తెలుపగా.. ఈ మేరకు ఈయూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈయూలో 16 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున వారికి మాత్రమే టీకాలు వేస్తున్నారు. పిల్లలకు మూడు వారాల విరామంతో మూడు డోసులు ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ ఈయూ సభ్యదేశాల మార్గదర్శకత్వంలో టీకా పంపిణీ సాగుతుందని ఫైజర్, బయో ఎంటెక్ తెలిపింది. ఇదిలా ఉండగా.. త్వరలో జర్మనీ, ఇటలీ సైతం టీకాలు వేసేందుకు సిద్ధమవుతున్నాయి.