హైదరాబాద్ : చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన సురేశ్ టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్రపోషించారని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే సుమన్ను సీఎం కేసీఆర్ ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.