నల్గొండ : జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్ర దవాఖానను జిల్లా కలెక్టర్ సందర్శించి క్యాజు వాలిటీ, ఓ.పి.బ్లాక్, దవాఖాన ఆవరణ, వార్డులు కలియ తిరిగారు. హాస్పిటల్ ఆవరణలో చెత్త లేకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. క్యాజువాలిటీ వార్డ్ సందర్శించి నూతనంగా సి.టి. స్కాన్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
రోగులు భౌతిక దూరం పాటించేలా సర్కిల్ లు గీసి రోగులు నిలబడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ వార్డ్ లలో ప్లంబర్, ఎలక్ట్రిక్ పనులు, టాయిలెట్ లలో రిపేర్ లు ఉంటే చేయాలని ఆదేశించారు. డాక్టర్స్ క్యాంటీన్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఓ.పి.బ్లాక్ షిప్టింగ్ నిర్మాణ పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ డి.ఈ. ని కలెక్టర్ ఆదేశించారు.
దవాఖాన సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి నిధులు అవసరముంటే ప్రతిపాదనలు సమర్పించాలని, కలెక్టర్ నిధుల నుంచి మంజూరు చేస్తానని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ జై సింగ్ రాథోడ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రాజ కుమారి, వైస్ ప్రిన్సిపాల్స్ డా.నిత్యా నంద, డా.జితేంద్ర, నోడల్ అధికారి డా.రమణ మూర్తి, గైనకాలజిస్ట్ డా.సుచరిత, ఆర్.యం.ఓ.లు. డా.ప్రశాంత్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం