మహబూబాబాద్ : కొవిడ్ పాజిటివ్ రాగానే ఆందోళన చెందవద్దని, ధైర్యం కోల్పోకుండా సరైన చికిత్స తీసుకుంటే కొవిడ్ నుంచి కోలుకోవడం కష్టంకాదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. 104 ఏళ్ల ముసలమ్మ కూడా కొవిడ్ నుంచి కోలుకుందని చెప్పారు. జిల్లాలోని కొత్తగూడ, గంగారంలలో కొవిడ్ వార్డులను మంత్రి, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎస్సీ నంద్యాల కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఇతర అధికారులు, నేతలతో కలిసి సందర్శించారు.
కొవిడ్ వార్డులలో ఉన్న వసతులు పరిశీలించారు. కొవిడ్ రోగులను పరామర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు పండ్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో కొవిడ్ కట్టడి కోసం గ్రామ కమిటీలు చేస్తున్న పనిని ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో పంపించాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లంక టూర్లో టీమిండియా కోచ్గా ద్రవిడ్
ఏరోసోల్స్ 10 మీటర్ల దూరం వ్యాపిస్తాయి…