రూ.15 వేలకు అమ్మిన తండ్రి
తల్లి ఫిర్యాదుతో గుర్తించిన పోలీసులు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 19 : కన్నకూతురినే ఓ కసాయి తండ్రి తాగుడుకు బానిసై బేరం పెట్టిన ఘటన మహబూబ్నగర్లో చోటుచేసుకున్ని. మహబూబ్నగర్ పట్టణంలో హనుమాన్పురకు చెందిన రహీం పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనికి ముగ్గురు మగపిల్లలు, కూతురు ఉన్నారు. పండ్లకోసం హైదరాబాద్కు వెళ్లే క్రమంలో ఆరాంఘర్ వద్ద సయ్యద్ హాఫిజ్ పరిచయం అయ్యాడు. అతనికి పిల్లలు లేకపోవడంతో ఎవరైనా పిల్లలను అమ్మితే పెంచుకుంటానని చెప్పడంతో తన కూతురినే అమ్మకానికి పెట్టాడు. రూ.15 వేలకు బేరం కుదుర్చుకుని మంగళవారం పాపను తీసుకెళ్లి ఆరాంఘర్ వద్ద విక్రయించాడు. పాప కనిపించకపోవడంతో తల్లి హసీనాబేగం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రహీంను విచారించగా, పాపను విక్రయించిన విషయం ఒప్పుకొన్నాడు. బుధవారం పోలీసులు హైదరాబాద్ వెళ్లి హఫీజ్ను అరెస్ట్ చేశారు. పాపను విక్రయించిన తండ్రిపై కూడా కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. పాపకు వైద్య పరీక్షలు నిర్వహించి సంరక్షణకు మహబూబ్నగర్లోని శిశువిహార్కు తరలించినట్లు మహబూబ్నగర్ వన్టౌన్ సీఐ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.