Narayanpet
- Nov 14, 2020 , 05:47:31
VIDEOS
దరఖాస్తు చేసుకోవాలి

నారాయణపేట : ఇంటర్ ప్రవేశాల కోసం మైనార్టీ విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా మైనార్టీ గురుకులాల సమన్వయకర్త గులాం హుస్సేన్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో 2020-21కి గానూ నూతనంగా కళాశాల మంజూరైందన్నా రు. ఎంపీసీలో 40 సీట్లు , బైపీసీలో 40 సీట్ల ఉన్నాయన్నారు. మైనార్టీ పాఠశాలలో పదో తరగతి పాసైన విద్యార్థులపై చదువుల కోసం, ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం కళాశాలను మంజూరు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని మైనార్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల మంజూరుకు కృషి చేసిన ఇంతియాజ్ ఇసాక్, అమీరుద్దీన్, అబ్దుల్ రహమాన్, ముజాయిద్ సిద్దిఖీ, మహ్మద్ అన్సారీలను అభినందించారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ బాలనర్సింహస్వామి పాల్గొన్నారు.
తాజావార్తలు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
MOST READ
TRENDING