మన్సూరాబాద్, మే 10 : కరోనాను జయించిన వారు ప్లాస్మాదానం చేయడానికి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని..ఇంటి నుంచి దవాఖానకు, తిరిగి ఇంటికి చేర్చేందుకు ఐదు కార్లను సిద్ధంగా ఉంచినట్లు సామాజిక కార్యకర్త దోసపాటి రాము తెలిపారు. నిరుడు లాక్డౌన్లో జీవనోపాధి కోల్పోయిన ఎంతోమంది నిరుపేదలకు సామాజిక కార్యకర్త దోసపాటి రాము నాగోల్ డివిజన్ రాక్హిల్స్ కాలనీలో నెలకొల్పిన రైస్ ఏటీఎం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విరుచుకపడుతుండడంతో చాలామంది ప్లాస్మా ఇవ్వాలని ఉన్నా సొంతంగా వాహనం లేకపోవడం, ఒకవేళ ఉన్నా ట్రాఫిక్ గజిబిజితో ముందుకురావడం లేదు. ఇలాంటి వారికోసం ఐదు వాహనాలను సిద్ధం చేశారు. ప్లాస్మాదానం చేయదల్చుకున్న వారు 9000998877 నంబర్కు ఫోన్ చేస్తే వాలంటీర్లు మీ ఇంటి వద్దకు వస్తారని ఆయన చెప్పారు.