హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుపోకుండా చూడాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని స్పష్టంచేశారు. పలు జిల్లాల్లో వస్తున్న సమస్యలను మారెడ్డి దృష్టికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో అవసరమైన వాహనాలను ఏర్పాటుచేయాలని జిల్లాల అధికారులకు ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ఎక్కువ ధాన్యం వస్తున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏమైనా సమస్యలుంటే 1967, 180042 500333 నంబర్లకు ఫోన్చేసి ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. ఇప్పటివరకు 3.42 లక్షల మంది రైతుల నుంచి 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఆయన వెల్లడించారు.