ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో తొలిసారి ఓ హిందూ యువతి ఉన్నత ఉద్యోగంలో నియమితురాలైంది. పాకిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్గా సనా రామ్చంద్ ఎంపికైంది. ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు కూడా. పాకిస్తాన్ సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ (సీఎస్ఎస్) లో ఉత్తీర్ణత సాధించిన సనా రామ్చంద్.. అనంతరం పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్) లో ఎంపికయ్యారు. ఇది మన దేశంలో ఐఏఎస్ తో సమానం.
పాకిస్తాన్ సీఎస్ఎస్ రాత పరీక్షలో 18,553 మంది అభ్యర్థులు హాజరవగా.. అందులో 221 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇందులో మెరిట్ సాధించిన సనా రామ్చంద్ ఆ దేశ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీసెస్కు ఎంపికవడం పట్ల సనా రామ్చంద్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదన్నారు. చిన్నతనం నుంచి ప్రతి అంశంలో విజయాన్ని కోరుకుంటూ సాధిస్తూ వచ్చానని, ఇప్పుడు ఇది సాధించానని చెప్పారు.
సింధ్ ప్రావిన్స్లోని షికార్పూర్ జిల్లాలో సనా రామ్చంద్ కుటుంబం నివసిస్తున్నది. సింధ్ ప్రావిన్స్ లోని చంద్కా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ప్రస్తుతం ఆమె సింధ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ, ట్రాన్స్పరెంట్ లో ఎఫ్సీపీఎస్ చదువుతున్నది. ఇది పూర్తి చేసిన తర్వాత ఆమె సర్జన్ అవుతుంది.
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
జూలై కల్లా ముగియనున్న కరోనా సెకండ్ వేవ్ : ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు
ఐరోపాలో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధం.. చరిత్రలో ఈరోజు
బెంగాల్ స్పీకర్గా బిమన్ బెనర్జి.. వరుసగా మూడోసారి ఎంపిక..!
మార్స్పై నాసా హెలికాప్టర్ చక్కర్లు.. తొలిసారి ఆడియో కూడా రికార్డ్.. వీడియో
ఆగస్టు నాటికి బ్రిటన్లో కరోనా అంతం
కోవిడ్తో ఊపిరితిత్తులే కాదు.. రక్తనాళాలకూ సమస్యే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..