లండన్ : రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టభద్రులంతా సీఎం కేసీఆర్ నాయకత్వానికి పట్టం కట్టారని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసారి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం పట్ల ఎన్నారైలంతా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విజయం సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిదర్శనమని పట్టభద్రులు నిరూపించారన్నారు.
అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు మాత్రం కేసీఆర్ వెంటే ఉన్నారని నిరూపించారన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం అవుతుందని ప్రజలు మరోసారి గుర్తు చేశారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్స్కి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదన్నారు.
వాణీదేవి గెలుపుపై టీఆర్ఎస్ మలేషియా హర్షం..
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం పట్ల టీఆర్ఎస్ మలేషియా హర్షం వ్యక్తం చేసింది. ఈ ఎన్నిక ద్వారా తెలంగాణలో ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని మళ్ళీ రుజువైందని టీఆర్ఎస్ మలేషియాశాఖ అధ్యక్షులు చిట్టిబాబు అన్నారు.