ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా మారుస్తాం

వనపర్తి, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం అమలు చేస్తున్న 10రోజుల కార్యచరణతో ప్రణాళికతో వనపర్తి రూపురేఖల ను మారుతుందని, ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా మారుస్తామని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు. 10రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగం గా చేపట్టిన కార్యక్రమంలో రెండోరోజు (మంగళవారం) పట్టణంలోని 3వ, 7వ, 17వ, 30వ వార్డులలో వార్డు ప్రత్యే కాధికారులు ప్రజలు, నాయకులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రా ష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో అమ లు చేసిన 30రోజుల కార్యాచరణ ప్రణాళికకు మంచి స్పందన వచ్చిందని, ఆ అనుభవంతో నే మున్సిపాలిటీ పట్టణాలలో కూడా 10రోజుల కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకా రం చుట్టినట్టు వారు తెలిపారు. మురికి కా ల్వలను శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల బెడద లేకుండా ఫాగింగ్ చేయడం, పాడుబడిన బావులను చేయడం వంటివి పట్టణ ప్రాంత పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్నామని వారు తెలిపారు. విద్యుత్ సమస్యలపై వంగిపోయిన స్తంభాలను, వేలాడుతున్న కరెంట్ వైర్లు గుర్తించి మూడు నెలల్లో పరిష్కరిస్తామని, వీధిలైట్లు మాత్రం 15రోజుల్లో ఏర్పా టు చేయడం జరుగుతుందన్నారు. 10రోజలు కార్యాచరణలో భాగంగా హరితహా రం కింద ఇంటింటికీ 5 మొక్కలను పం పిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ యా వార్డుల కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
సమగ్రాభివృద్ధి కోసమే పట్టణ ప్రగతి
పెబ్బేరు: పట్టణ సమగ్రాభివృద్ధికోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్ర భుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ ఎద్దుల కరుణశ్రీ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా రెండో రోజు మంగళవారం చైర్పర్సన్ 1వ వార్డు, 2వ వార్డులో కౌన్సిలర్ అక్కమ్మ, మూడో వార్డులో పార్వతి, నాల్గో వార్డులో కౌన్సిల ర్ సువర్ణ, 5వ వార్డులో గోపిబాబు, ఆరో వార్డులో రామకృష్ణ, ఏడోవార్డులో ఎల్లస్వామి, ఎనిమిదో వార్డులో చిన్న ఎల్లారెడ్డి, 9వ వార్డులో అశ్విని, పదోవార్డులో పద్మ, 11వ వార్డులో వైస్ చైర్మన్ కర్రెస్వామి, 12వ వార్డులో సుమతి తాగునీరు సమస్య, పారిశుధ్యం, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల తొలగింపు, వేలాడుతున్న విద్యుత్లైన్లకు మరమ్మతులు తదితర పనుల చర్యలు చేపట్టా రు. చైర్పర్సన్ కురణశ్రీ వార్డుల్లో చేపడుతు న్న పనులను పరిశీలించారు. పట్టణ ప్రగతి లో భాగంగా ప్రజలను భాగస్వాములుగా పరుస్తూ పది రోజులలో పట్టణాన్ని రూపురేఖలు మారుస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ చలపతి, మేనేజర్ రమేశ్ నాయక్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రిన్స్ సల్మాన్ ఆదేశాల ప్రకారమే జర్నలిస్టు ఖషోగ్గి హత్య
- అతివేగం, మద్యంమత్తుకు మరో ప్రాణం బలి
- ఎన్టీఆర్ మాస్క్పై చర్చ.. ధర తెలుసుకొని షాక్..!
- చైనా వ్యాక్సిన్ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం