క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తన ఉత్తమాభిరుచిని ప్రతిబింబించే సినిమాల రూపకల్పన కోసం సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్పై ‘కుమారి 21ఎఫ్’ ‘ఉప్పెన’ వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. తాజాగా యువ కథానాయకుడు కార్తికేయతో సుకుమార్ రైటింగ్స్ సంస్థ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తోంది. ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్లో కార్తికేయ పర్ఫార్మెన్స్ను ఎంతగానో ఇష్టపడిన సుకుమార్ ఈ యువహీరోతో సినిమాకు ప్లాన్ చేశారు. నవంబర్లో చిత్రం ప్రారంభం కానున్నది.