గోవింద గోవింద

- పాలమూరులో మార్మోగిన గోవింద నామస్మరణ
- ఆకట్టుకున్న కోలాటాలు, అడుగుల భజన
- పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
- ఘనంగా లక్ష్మీ వెంకన్న ఉత్సవ విగ్రహాల ఊరేగింపు
- వైభవంగా మన్యంకొండ వెంకన్న గ్రామోత్సవం
అడుగడుగునా పటాకులు కాలుస్తూ రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. న్యూటౌన్, కొత్త బ స్టాండ్, రాంమందిర్ చౌరస్తా, వన్టౌన్, బండమీదిపల్లి మీదుగా మన్యంకొండకు స్వామివారి రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, నాయకులు మల్లు న ర్సింహారెడ్డి, రాఘవేంద్రగౌడ్, కౌ న్సిలర్లు కట్టా రవికిషన్రెడ్డి, రమాదేవి, గోవిందు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, దేవేందర్రెడ్డి, చంద్రశేఖర్, శ్రీ నివాస్, రవీందర్రెడ్డి, రాధిక పాల్గొన్నారు.
కర్నూలు కోచ్ మిడ్లైఫ్ రిహాబిలిటేషన్ సెంటర్కు రూ. 30కోట్లు..
జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లో 280 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రతిపాదించిన రైల్వే కోచ్ మిడ్లైఫ్ రిహాబిలిటేషన్ సెంటర్ (బోగీల మరమ్మతు కేంద్రం) కోసం రూ. 30 కోట్లు విడుదల చేశారు. ఆలంపూర్ మండలం సరిహద్దుల్లో ఉన్న ఈ కేంద్రం ప్రతిపాదిత ప్రదేశంలో తెలంగాణకు చెందిన 20 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ కేంద్రంలో లక్ష కి.మీ. తిరిగిన ప్రతి బోగీ పరిస్థితిని సమీక్షించి అవసరమైన మరమ్మతులు చేయనున్నారు. ఈ సెంటర్ వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
భద్రతకే ప్రాధాన్యం..
ఈ రైల్వే బడ్జెట్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్ని కాపలాలేని రైల్వే గేట్లను దశలవారీగా మూసేస్తున్నారు. వాటి స్థానంలో అండర్ పాస్లను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ఆర్వోబీలు, ఆర్యుబీలను సైతం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల సదుపాయాలకు ఈ బడ్జెట్లో భారీగానే కేటాయింపులు జరిపారు. రూ. 672 కోట్లను మన జోన్ పరిధిలో సదుపాయాలకు కేటాయించారంటేనే అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!