రాజన్న సిరిసిల్ల :మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం హెలికాప్టర్ సేవలు ప్రవేశపెట్టింది.
గత సంవత్సరం మాదిరిగానే ఈసారి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ సేవలు భక్తులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది.
బుధవారం ఉదయం
10.30 గంటలకు
హెలికాప్టర్ సేవలను అధికారులు ప్రారంభించనున్నారు. గుడి చెరువు వద్ద హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు.
హెలికాప్టర్ ద్వారా
మధ్య మానేరు,
నాంపల్లి గుట్ట, వేములవాడ పుణ్యక్షేత్రం వీక్షించవచ్చు. ఒక్కో ప్రయాణికుడికి 7 నిమిషాలకు రూ. 3,000,
పదిహేను నిమిషాలకు రూ. 5,500 ప్రయాణ చార్జీలుగా నిర్ణయించారు.
వేములవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే వారికి ఒక్కో ప్రయాణికుడికి రూ. 12,500 చార్జీలు వసూలు చేస్తున్నారు.
రాను, పోను రూ. 25,000లు
చార్జీలు వసూలు చేస్తారు. హైదరాబాద్ వెళ్లాలంటే ఆరుగురు ప్రయాణికులు తప్పనిసరిగా ఉంటేనే హెలికాప్టర్లో తీసుకెళ్తారు.
కాగా, హెలికాప్టర్లో ప్రయాణించే వారికి దర్శనం, భోజనం సౌకర్యాలు ఉండవని అధికారులు తెలిపారు.