పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం

మరికల్ : పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు ఉద యం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతుల కు హాజరయ్యే విద్యార్థులకు సోమవారం అల్పాహారాన్ని జెడ్పీ వైస్ చైర్ పర్స న్ గౌని సురేఖారెడ్డి, సర్పంచ్ కస్పే గోవర్ధన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుంచి పదో తరగతి పరీక్షలు జరిగె వరకు విద్యార్థులకు ఉదయం పూట పస్తులు ఉండకుండా గ్రామానికి చెందిన సరస్వతి డీగ్రీ కళాశాల కరస్పాడెంట్ రాములు విద్యార్థులకు అల్పాహారం అందిస్తూండడం హర్షణీయమని అన్నారు. దాతలు సాయంత్రం కూడా అల్పాహారం అందించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీ సూజా త, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ నర్సింలు, పాఠశాల హెచ్ఎం మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయులు బాల్లింగయ్య, సరస్వతీ డీగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాములు, ఏబీవీపీ మండల కన్వీనర్ రాజేష్, యువక మండలి అధ్యక్షుడు అంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం గుర్తించండి: టీటీడీ ఈవో
- అనసూయ స్టెప్పులు అదరహో..'పైన పటారం' లిరికల్ వీడియో
- మహారాష్ట్రలో కొత్తగా 6,397 కరోనా కేసులు.. 30 మరణాలు
- శృంగారానికి ముందు వీటిని అస్సలు తినకండి..!
- అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
- ఏపీలో తగ్గిన కరోనా కేసులు
- పలువురు సిట్టింగులను తప్పించనున్న మమతా బెనర్జీ..?
- అమిత్ షాకు నారాయణ స్వామి సవాల్
- హైదరాబాద్కు చంద్రబాబు తిరుగు ప్రయాణం
- నాగార్జున 'బంగార్రాజు' అప్డేట్