న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, రాజకీయ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కొవిడ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్య సిబ్బంది ఆయనకు టీకా వేశారు. ఈ నెల 1 నుంచి 60 ఏండ్లు పైబడిన వృద్ధులకు, 45 ఏండ్లు దాటిన దీర్ఘకాలిక రోగులకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులతోపాటు సాధారణ ప్రజలు కూడా టీకాలు వేయించుకుంటున్నారు. అందులోభాగంగానే ఇవాళ అద్వానీ కూడీ టీకా తీసుకున్నారు.