ప్రత్యేక ప్రతినిధి, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి దేశానికే లాభం జరుగుతున్నది తప్ప.. కేంద్రం నుంచి రాష్ర్టానికి ఒరిగేదేమీ లేదని మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. ఆరేండ్లలో తెలంగాణ నుంచి వివిధ రకాల పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు రూ.2,72,926 కోట్లు సమకూరితే.. ప్రతిగా రాష్ర్టానికి కేంద్రం ఇచ్చింది రూ.1,40,929 కోట్లు మాత్రమేనని తెలిపారు. కౌన్ కిస్కో కాంట్రిబ్యూట్ కర్ రహాహై (ఎవరు ఎవరికి లాభం చేస్తున్నారు) అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రం బాగుపడుతున్నదని మాట్లాడుతున్న అజ్ఞానికి (బండి సంజయ్ను ఉద్దేశించి)కి ఎవరైనా జ్ఞానం కలిగించండి.. అని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గణాంకాలు వెల్లడించారు.