అభాగ్యుడి అవతారం మార్చిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ్ మహ్మద్
వృద్ధుడికి క్షవరం చేయించి.. అన్నం తినిపించి సపర్యలు
ములుగు రూరల్: ఆమె ఓ సబ్ రిజిస్ట్రార్ అయినా.. ఆపదలో ఆదుకునేందుకు నేనున్నానంటూ ముందుకొస్తున్నారు. చేసేది ఉన్నత ఉద్యోగమైనా పొలంలో నాట్లు వేసి వచ్చిన డబ్బును పేదలకు పంచుతున్నారు. లాక్డౌన్తో ఏజెన్సీ ప్రాంతవాసుల ఆకలిదప్పులు తీర్చేందుకు వాగులు దాటి.. కొండలు ఎక్కారు. గత బుధవారం విధులకు వెళ్తున్న క్రమంలో మల్లంపల్లి వద్ద మతిస్థిమితం లేని ఓ వృద్ధుడిని చూసి చలించిపోయారు. తన టిఫిన్ బాక్స్ తీసుకెళ్లి అతని ఆకలి తీర్చారు. అలానే వదిలేయకుండా శనివారం మళ్లీ అక్కడికి వచ్చి వృద్ధుడికి క్షవరం, స్నానం చేయించారు. కొత్త దుస్తులు వేయించి అభాగ్యుడికి అమ్మలా మారారు.