మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

నారాయణపేట రూరల్ : నేడు జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రత్యేకాధికారి చీర్ల శ్రీనివాసులు, మున్సిపల్ ఇన్ కమిషనర్ సందీప్ తెలిపారు. పేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో 48 మంది పీవోలు, 48 మంది ఏపీవోలు, 124 మంది ఓపీవోలను నియమించడంతో పాటు అదనంగా నలుగురు పీవో లు, నలుగురు ఏపీవోలు, 15 మంది ఓపీవోలను రిజర్వులో ఉంచినట్లు చెప్పారు. ఈ పోలింగ్ కేంద్రాల పరిశీలనకు గాను 6 రూట్లు ఏర్పాటు చేసి 6గురు జోనల్ ఆఫీసర్ నియమించినట్లు వారు ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పరిశీలించనున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద మంగళవారం ఆయా పో లింగ్ కేంద్రాలకు సంబందించి సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ వెంకట్రావులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పోలింగ్ సిబ్బందిని ప్రత్యేక వాహనాలలో వారి వారి పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
తాజావార్తలు
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్గా వైష్ణవ్తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో