కోరిన కోరికలు తీర్చే రామలింగేశ్వరస్వామి

కోడేరు: మండల పరిధిలోని ఎత్తం గట్టుపై వెలసిన రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులు కోరిన కోరికలు తీర్చే మహిమగల దేవుడిగా ఎత్తం రామలింగేశ్వరస్వామి ప్రజలచే ప్రతి ఏటా పూజలు అందుకుంటున్నాడు. కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులోని ఎత్తం గట్టుపై వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఉత్సవాలు ఈనెల14,15,16, తేదీలలో అత్యంత వైభవంగా జరుపనున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినానికి వరుసగా మూడుసార్లు ఎత్తం గట్టు ఎక్కితే భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని ఈప్రాంత ప్రజల నమ్మకం. సుమారు 450 ఏళ్ల కిందట జయలక్ష్మారెడ్డి అనే సంస్థానాధీశుడు ఎత్తం గ్రామానికి సమీపంలో ఉన్న కల్వకోలులో నంది కోటను నిర్మించి ఈప్రాంతాన్ని పరిపాలించేవారు. మిగతా తెలంగాణ సంస్థానాధీశులకు వైరిగా ఉండటంతో వారు ఇతన్ని హతమార్చారు. అతని మరణానంతరం పాన్గల్ ఖిల్లాను ఏలుతున్న అల్లాఉద్దీన్ ఇదే అదునుగా తీసుకొని ఎత్తం కల్వకోలును స్వాధీనం చేసుకొని తన మిత్రుడైన కరణం నారాయణరావుకు ఈప్రాంతాన్ని భుక్తిగా ఇచ్చి సత్కరించారు. ఇతడు గొప్ప రామభక్తుడు కావడంతో ఎత్తం గ్రామానికి సమీపంలో ఉన్న అతి ఎత్తైన గట్టు శిఖరంపై శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని పురవస్తువాఖ అధికారులు తెలుపుతున్నారు.
కొల్లాపూర్కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన..ఎత్తం గ్రామ శివారులో సుమారు 2000అడుగుల ఎత్తులో గట్టుపై బండరాళ్లతో ఏర్పాటు చేసిన చిన్న గుడిలో వెలసిందే శ్రీ రామలింగేశ్వరస్వామి. ఇక్కడ లింగం రూపంలో ఉండి విష్ణువు నామాలు కళ్లు కిరీటం తదితర వెండి ఆభరణాలతో శివకేశవ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు జరుగుతాయి. గ్రామాల్లో సంక్రాంతి పండుగను ప్రజలు జరుపుకుంటే ఇతర ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో భోగి మరుసటి రోజున స్వామి వారికి తమ మొక్కులను చెల్లించుకునేందుకు కొండమీదికి భక్తులు వెళ్తారు. వందలాది మంది భక్తులు ఎత్తైన కొండపైకి ఒకరి వరుసలో ఒకరు బయలుదేరి ఎక్కుతారు. భక్తులు చీకటిలో చలిని సైతం లెక్క చేయకుండా జనవరి 14, తేదీలలో రాళ్లు చెట్లు ముళ్లు రాతి గుహలు పెద్ద పెద్ద రాతి గుండ్లను దాటుతూ పైకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఎక్కుతారు. ఈ క్షేత్రం మిక్కిలి మహిమ గలది కనుకనే పూర్వ రామభక్తులైన హనుమదాసు, వెంకటదాసులు స్వామిని దర్శించి స్వామిపై కీర్తనలు రచించారు. మకరసంక్రమణ పణ్యకాలం పవిత్రమైనది కనుక ఇప్పటికీ స్వా దర్శించి కానుకలు సమర్పిస్తారు. రాత్రి వేళల్లో కొండపై వెలిగించే మకర జ్యోతిని దర్శించటానికి ఈమూడు రోజులు భక్తులు అశేషంగా తరలివస్తారు.
నాగర్కర్నూల్కు 34 కిలోమీటర్ల దూరంలో
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి సుమారు 34 కిలోమీటర్ల దూరంలో ఎత్తం గట్టు ఉన్నది. కోడేరు మండలం కేంద్రం మీదుగా కొల్లాపూర్కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఎత్తం గట్టు శిఖరంపై ఈ ఆలయాన్ని బండరాళ్లతో ఏర్పాటు చేశారు. అలాగే నియోజకవర్గ కేంద్రమైన కొల్లాపూర్కు కేవలం 20 కిలో మీటర్ల దూరంలో, కోడేరు నుంచి కొల్లాపూర్ వెళ్లే రోడ్డుకు అతి సమీపంలో ఉంది. ప్రధాన రోడ్డునుంచి వ్యవసాయ పొలాలగుండా గట్టు వద్దకు చేరుకోవచ్చు.
తాజావార్తలు
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
- మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!