ఊట్కూర్, అక్టోబర్ 19 : మతాలు వేరైనా..మానవులం తా ఒక్కటేనని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని అన్ని పట్టణ, మండలకేంద్రాల్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పలు మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని బుర్హాన్గడ్డలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతనిస్తూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. ముస్లింల సామాజిక, ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆధ్మాత్మిక భావాలను అలవాటు చే సుకోవాలన్నారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించ గా ఎమ్మెల్యే పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో మా ర్కెట్ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఊట్కూర్లో..
మండలకేంద్రంతోపాటు చిన్నపొర్ల, పెద్దపొర్ల, పగిడిమర్రి గ్రామాల్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఎంకంపేట వీధిలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మం డల కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహమాన్, మైనార్టీ సెల్ నా యకుడు నాసీర్ఖాన్, డాక్టర్ శ్రీకాంత్రెడ్డి, నాయకులు, కా ర్యకర్తలు పాల్గొన్నారు.
ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
మండలంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వయించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హాజరయ్యారు. వివిధ గ్రామాల నుంచి ముఖ్య నాయకులు, ము స్లింలు, టీఆర్ఎస్ నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు. పట్టణంలోని పలు వీధుల్లో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సన్మార్గంలో నడుస్తూ, వారి బోధనలకు సార్థకం చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కా ర్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి. సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు వీరారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సి.వెంకటయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
మండలకేంద్రంతోపాటు మూడుమా ల, హిందూపూర్, గుడెబల్లూర్ తదితర గ్రామాల్లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ము స్లిం మతపెద్దల నబీ జీవిత చరిత్రను వివరించారు. ప్రతిఒక్కరూ ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అ నంతరం ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు, నాయుకులు తదితరు లు పాల్గొన్నారు.
బందోబస్తు పర్యవేక్షణ
మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బందోబస్తును ఎస్పీ చేతన పర్యవేక్షించారు. పాత బస్టాండ్, సెంటర్ చౌక్, మదీన మసీద్, సరఫ్ బజార్ తదితర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశా రు. కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్రావు, సీఐ శ్రీకాంత్రెడ్డి, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
శీతలపానీయాలు పంపిణీ
జిల్లా కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు చౌక్ బ జార్ వద్ద ముస్లింలు నిర్వహించిన ర్యాలీకి స్వాగతం పలుకుతూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ నా యకులు ముస్లిం మత పెద్దలకు శీతలపానీయాలు పంపి ణీ చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగదీశ్, టీఆర్ఎస్ పట్ట ణ అధ్యక్షుడు విజయ్సాగర్, సీనియర్ నాయకుడు ప్రతాప్రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజవర్ధన్రెడ్డి, కౌన్సిలర్ గురులింగ ప్ప తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కోస్గి, అక్టోబర్ 19 : మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హాట్కర్ వీధి నుంచి ప్రారంభమైన ర్యాలీ మహబూబీయా మసీద్, శివాజీ చౌరస్తా నుంచి పట్టణంలోని పలు వీధుల్లో నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రవ క్త బోధనలకు అనుగుణంగా శాంతి, మత సామరస్యం, సహ నం, శాంతియూత సహజీవనమే ప్రవక్తకు మనం అందించే నివాళి అని చెప్పారు. సీఎం కేసీఆర్ మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడని చెప్పారు. ముస్లింలు భక్తిశ్రద్ధలతో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి పేదలకు వరం
మండలంలోని సర్జకన్పేట గ్రామానికి చెందిన ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఎల్వోసీ రూ.2,00,000 చెక్కును ఎమ్మెల్యే అందించారు. సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు అనారోగ్యంతో బాధపడుతున్న అండగా నిలిచిందన్నారు.
నారాయణపేట మండలంలో…
మండలంలోని కోటకొండ, జాజాపూర్, కొల్లంపల్లితోపాటు తదితర గ్రామా ల్లో మిలాద్ ఉన్ నబీ వేడకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కోటకొండలో ముస్లిం సోదరులు మత సామరస్య సదస్సు నిర్వహించి ప్రవక్త బోధనలు, ఆశయాలను స్మరించుకున్నారు. జాజాపూర్లో మసీద్ కమి టీ అధ్యక్షుడు బి.జావిద్, ఉపాధ్యక్షుడు మౌలానా ఆధ్వర్యం లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, మైనార్టీ నాయకులు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.