నారాయణపేట టౌన్, జూలై 25 :వారం రోజుల నుంచి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వి విధ మండలాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొ ర్లుతున్నాయి. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. వర్షాలు అధికంగా కురువడంతో ముఖ్యంగా పత్తి, మక్కజొ న్న, జొన్న, వరి తదితర పంటలు నష్టపోయే అవకాశం ఉ న్నందువల్ల వ్యవసాయాధికారుల సూచనలు పాటించి త మ పంటలను కాపాడుకోవాలి.
మండలంలో 6,500 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట, 17 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట, 14 వేల ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. అయితే అధికంగా కురిసిన వర్షాల కారణంగా మండలంలో దాదాపు 250 ఎకరాల్లో వరి, 350 ఎకరాల్లో పత్తి, 150 ఎకరాల్లో కంది పంట నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే వర్షాలు త గ్గాక కంది పంటలో చేరిన నీటిని తొలగిస్తే సరిపోతుందని, కానీ పత్తి, వరి పంటలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
పత్తి పంటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అధిక వర్షాల కారణంగా పత్తి పంట పొలాల్లో నీరు చేరి నట్లయితే మొక్కకు పోషక విలువలు అందకపోవడం వల్ల అక్కడక్కడ మొక్కలు వాడిపోయి చనిపోయినట్లు కనిపిస్తా యి. అలాంటి సమయంలో వర్షాలు తగ్గిన తర్వాత కాలువల ద్వారా చేనులోని నీటిని తీసి వేయాలి. ఒక లీటర్ నీటి కి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి నాజిల్ తీసి మొక్క మొదళ్లల్లో పోయాలి. తిరిగి మూడురోజుల ఒక లీటర్ నీటి లో 10 గ్రాముల నీటిలో కరిగే ఎరువులైన 19ః19ః19, 13ః0ః45 కలిపి పిచికారీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విధంగా చేసినట్లయితే ఎండిపోయిన మొక్కలు మళ్లీ చిగురిస్తాయని తెలుపుతున్నారు.
వరి పంటకు …
వరి పంట నారుమడి దశలో ఉన్నట్లయితే తెల్లబడకుండా ఉండేందుకు లీటరు నీటికి 20గ్రాముల యూరి యా లేదా 5 గ్రాముల 19ః19ః19ను 10 రోజుల వ్యవధి లో రెండు సార్లు పిచికారీ చేయాలి. అదేవిధంగా వరి పంట నాట్లు పూర్తయ్యి పిలకలు వేసే దశలో ఉన్నట్లయితే ముం దుగా నీటిని పూర్తిగా తీసివేసి, తర్వాత వెంట్రుక మందం చీలిక వచ్చే వరకు ఆరబెట్టాలి. దీని వల్ల పిలకలు నష్టపోకుండా కోలుకొని వేగంగా పెరుగుతాయి.
నీరంతా తీసివేయాలి…
పొలాల్లో నీరు చేరిందని రైతులు కంగారు పడాల్సిన పని లేదు. వర్షం కురువడం తగ్గాక పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా, నీరంతా తీసివేయాలి. ఖరీదైన మందులు వాడకుండా వ్యవసాయ అధికారులను సంప్రదించి వారు సూచించిన మందులను వాడాలి.
-నాగరాజు, మండల వ్యవసాయాధికారి