మరికల్, సెప్టెంబర్ 24 : రైతులు ఒకే రకమైన పంటలు పండించకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వ చ్చే ఆయిల్పామ్ సాగుపై జిల్లాలోని రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. శుక్రవారం మండలకేంద్రానికి చెందిన రఘు వరి పంట, దండు నారాయణరెడ్డికి చెందిన ఎర్రచందనం, శ్రీగంధం తోట, మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డికి చెం దిన ఆయిల్పామ్ పంటలను పరిశీలించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆయిల్పామ్ తోటలు వే సుకోవాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం అందజేస్తు న్న సబ్సిడీని అందిస్తామన్నారు. ఆయిల్పామ్ తోటలో అం తర్ పంటలను కూడా సాగు చేసుకోవచ్చన్నారు. మరికల్కు చెందిన రఘు రెండు ఎకరాల్లో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా, తెలంగాణ సిరి వరి పంటను సాగు చేయడంతో ఆయనను కలెక్టర్ అభినందించారు. ఆయిల్పామ్ పంట పండించడంతో రైతులకు అధిక లాభాలు వ స్తాయన్నారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ స్వ ర్ణాసుధాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్సు ధాకర్, ఉద్యాన శాఖ అధికారి వెంకటేశ్వ ర్లు, మండల వ్యవసాయ శాఖ అ ధికారి శివకుమార్, తాసిల్దార్ శ్రీధర్, ఎంపీడీవో య శోద మ్మ, సిబ్బంది పాల్గొన్నారు.