యాదాద్రి: మరో ఇరవై ఏండ్ల వరకు టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేం దర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్లో బలంగా నాటుకు పోయాయని స్పష్టం చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో ఎన్నికల ఇన్చార్జి కొండోజు ఆంజనేయులు, పల్లె సంతోష్ ఆధ్వ ర్యంలో జరిగిన టీఆర్ ఎస్ పార్టీ పట్టణ నూతన కార్యవర్గం ఎన్నికల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కష్ట పడి పని చేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉం టుందన్నారు. గ్రామ కమిటీల్లో అవకాశం రాని వారికి మండల, జిల్లా కమిటీల్లో అవకాశం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ పట్ల, టీఆర్ఎస్ పార్టీ పట్ల రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయమని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.
ఈ పథకాల ను గ్రామ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు విజయవంతంగా సాగిందన్నారు. 100 శాతం ఎన్నికల ఎకగ్రీవంగా జరిగా యని తెలిపారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో గ్రామ, వార్డు కమిటీలు పూర్తి చేసుకుని రాష్ట్రంలో ఆలేరు నియోజక వర్గం అగ్రభాగాన నిలిచిందన్నారు.
8 మండలాల్లో 233 గ్రామ, మధిర గ్రామాల కమిటీలు, 2 పట్టణాలలోని 24 వార్డు కమిటీల, విద్యార్ధి, యువజన, రైతు, మహిళా కమిటీలతో పాటు 10 విభాగాల కమిటీలు ఎన్నుకున్నామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో ప్రజాస్వామ్యబద్దంగా సంపూర్ణంగా పూర్తి చేసిన నేపథ్యంలో మండల ఇన్చార్జిలు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శు లు, ప్రజాప్రతినిధులకు ధన్య వాదాలు తెలిపారు. వచ్చే 19వ తేదీ వరకు అన్ని మండలాల కమిటీలు వేయనున్నామని టీఆర్ఎస్ శ్రేణులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపనలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిప ల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాగౌడ్, వైస్ చైర్మన్ కాటంరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, బూడిద సురేంద ర్, ఆవుల మమతాసాయి, రైతు బంధు సమితి జిల్లా డైరక్టర్ మిట్ట వెంకటయ్య, కో ఆప్షన్ సభ్యురాలు గోర్ల పద్మ, నాయ కులు ముఖ్యర్ల అండాలు, వాసం రమేశ్, చిత్తర్ల బాలయ్య, ముఖ్యర్ల సతీశ్, అంకం నర్సింహా, కీసరి బాలరాజుగౌడ్, పాప ట్ల నరహరి, కసావు శ్రీనివాస్, పెళిమెల్లి శ్రీదర్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.