యాదాద్రి, మార్చి31: యాదగిరిగుట్ట పురపాలక సంఘం 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం బుధవారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సనన్ ఎరుకల సుధ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సర అంచనా బడ్జెట్ ఆదాయం రూ. 13.29 కో ట్లు, వ్యయం రూ. 13.25 కోట్లకు ఆమోదం తెలిపారు. పట్ట ణంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలతో పలు అభివృద్ధి పను లు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ప్రభాకర్రెడ్డి, వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, బబ్బూరి మౌనిక, ముఖ్యర్ల మల్లేశ్, దండబోయిన అనిల్, సీస విజయలక్ష్మీ, గౌలికార్ అరుణ, గుండ్లపల్లి వాణి, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ బాబా, పేరబోయిన పెంటయ్య, ఎండీ రిజ్వాన తదితరులు పాల్గొన్నారు.
పుర బడ్జెట్ రూ. 25.12లక్షలు
ఆలేరు పురపాలక సంఘం పరిధి లోని 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 25కోట్లతో కూడిన బడ్జెట్ను అధికారులు బుధవారం ప్రవేశపెట్టారు. ము న్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ నా గేంద్రబాబు అంచనాలతో కూడిన బడ్జెట్ను ఉద్దేశించి మాట్లా డారు. అనంతరం అంచనా బడ్జెట్పై కౌన్సిలర్లు తమ అభిప్రా యాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మాట్లాడుతూ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధన ల ప్రకారమే బడ్జెట్ అంచనాలను రూపొందించామని, సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అలాగే అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ మాట్లాడుతూ బడ్జెట్ అంచనా ప్రతిపాదనలు కలెక్టర్ పరిశీలన అనంతరం ఆమోదం కోసం ఉన్నత అధికా రులకు పంపుతామన్నారు. కౌన్సిలర్లు పట్టణ అభివృద్ధికి పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మా ధవి, కౌన్సిలర్లు రాములు, శమంత, సునీతారెడ్డి, సునీత, దయామణి, శ్రీకాంత్, కందుల శ్రీకాంత్,నర్సింహులు, కో ఆప్షన్ మెంబర్లు సీస రాజేశ్, రియాశ్, లత పాల్గొన్నారు.