మర్రిగూడ: ఆంధ్రా పెత్తందార్ల దోపిడి పాలన నుంచి టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ జాతికి విముక్తి లభించిందని మునుగో డు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఎంజేఆర్ బీఈడీ కళా శాల భవనంలో నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది అవిశ్రాంత పోరాటమని పేర్కొన్నారు.
కార్యకర్తలు పార్టీకి ఫిల్లర్ల వంటి వారని పార్టీ అభివృద్ధి కోసం కష్ట పడితేనే గుర్తింపు వస్తుందని అన్నారు. సెప్టెంబర్ 2న ఢిల్లీలో తెలంగాణ భవనానికి భూమి పూజ చేయనున్న సందర్భంగా అన్ని గ్రామాల్లో గురువారం గులాబీ జెండా పం డుగను ఘనంగా నిర్వహించాలని కార్య కర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ గ్రామ,మండల కమిటీల్లో పార్టీ కోసం కష్ట పడే వారికే బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు స్పస్టం చేశారు. పటి ష్టమైన గ్రామ కమిటీలుంటేనే పార్టీ బలోపేతమవుతుంద న్నారు. పాత,కొత్త తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని మరో 20 ఏండ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టే అధికా రంలో ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని ఢీ కొనలేక ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు చేస్తూ దొంగలంతా ఒకటవుతున్నారని మండి ప డ్డారు. తుంగపాడు, సరంపేట తదితర గ్రామాల్లో బ్రిడ్జీలు కూలిపోయి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని నిధులు మం జూరు చేయించి పనులు చేపడుతామన్నారు.
ఉనికిని కాపాడుకునేందుకే కోమటిరెడ్డి రాజీనామా నాటకం
మునుగోడు నియోజకవర్గానికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న దురదృష్ట మని కూసుకుంట్ల విమర్శించారు. ఉనికిని చాటుకునేందుకే 2000 కోట్లిస్తే రాజీనామా చేస్తా అనే నాటకం మొదలుపెట్టాడ ని ఎద్దేవా చేశారు. ఎవరో రాజీనామా చేస్తే ఈ ప్రాంతంలో శివన్నగూడెం ప్రాజెక్టు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, భగీరథ పథ కాలు రాలేదని దుయ్యబట్టారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిలో ఉందని ప్రతిపక్షాల విమర్శలను టీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా తిప్పి కొట్టాలన్నారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ నోళ్లు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
చెక్కుల పంపిణీ
నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నల్లగాస్ జగత్ ప్రమాదవశాత్తు చనిపోగా పార్టీ భీమా కింద మంజూరైన రూ. 2లక్షలు, మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన పల్లె పెద్ద యాదయ్యకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.60 వేల చెక్కులను ఆయన బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు మాల్ మార్కెట్ మాజీ చైర్మన్ నాగులవంచ నరేందర్ రావు మృతికి సంతాపంగా రెండు నిమిషాలు సమావేశంలో మౌనం పాటించి నివాళులర్పించారు.
సమావేశంలో ఎంపీపీలు మెండు మోహన్రెడ్డి, ఏడుదొడ్ల శ్వేతారవీందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు మార్కెట్ కమి టీ చైర్మన్ దంటు జగదీశ్వర్, గుమ్మడపు నర్సింహారావు, సహకార చైర్మన్లు బాలం నర్సింహ, పందుల యాదయ్య, సర్పంచ్లు నల్ల యాదయ్య, బాషిపా క రాములు, ప్రధాన కార్యదర్శి లపంగి నర్సింహ, నాయకులు బచ్చు రామకృష్ణ, పానగంటి వెంకన్న, ఎంపీటీసీలు నేనావత్ బంతిలాల్, సరిత, రాజమణి, నాయకులు మారగోని రామన్న, రామేశ్వర్ రావు, రాములుగౌడ్, లింగంగౌడ్, హనుమంతు, గోవర్థన్ పాల్గొన్నారు.