నల్లగొండ : రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతున్నదని నల్లగొండ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం విటీ కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గ పరిధిలోని నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మాడుగులపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ సంక్షేమ పథకాలు పేదవారింటి ఆడపిల్లల పెండ్లి కానుకలుగా వారి కుటుంబాలలో సంతోశాల్ని పంచుతున్నాయని తెలిపారు. మన ముఖ్యమంత్రి పేదల పక్షపాతి అని వారి అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి దిగ్విజయంగా కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. పేద ప్రజలంతా ఎప్పటికీ ఇటువంటి ప్రభుత్వాలనే కోరుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష, మార్కెట్ కమిటీ చైర్మెన్ బొర్ర సుధాకర్, కనగల్ తిప్పర్తి ఎంపీపీలు, కరీం పాషా, నాగులవంచ విజయలక్ష్మి, సింగిల్విండో చైర్మన్ ఆలకుంట నాగరత్నం రాజు, తిప్పర్తి కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగొని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.