కట్టంగూర్: గ్రామ దేవతలను పూజించడం మన తెలంగాణ ప్రాంత సంప్రదాయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా రు. మండలంలోని ఎరసానిగూడెంలో నూతనంగా నిర్మించిన ఈదమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం అమ్మవారి కల్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడుతూ గ్రామ దేవతల శక్తి అంతా వైదిక, పురాతన ఆరాధ నలో ఉంటుందని అందులో భాగంగానే గ్రామ దేవతలను పూజించడం సంప్రాదాయకంగా వస్తుందన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, సర్పంచ్లు సిరిగిరెడ్డి వినోద, ఎంపీటీసీ ఎడ్ల పురోషోత్తంరెడ్డి, ఆకిటి వెంకన్న, సత్యనారాయణచారి, రామచంద్రు, ఆనందం, సురేందర్, బుచ్చాలు పాల్గొన్నారు.