మాడ్గులపల్లి: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనందున బడుల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది శానిటైజేషన్ చేయాలని డీపీవో విష్ణువర్ధన్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ పాఠశాలకు విద్యార్థులు అధికంగా హాజరయ్యేలా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అవగాహన కలిగించాలన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో జితేందర్రెడ్డి, ఎంపీవో రవి కుమార్, ఎంఈవో నర్సింహానాయక్, సర్పంచ్ శోభ ఉన్నారు.
పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
తిప్పర్తి: అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయితీ అధికారి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించారు. తాగునీటి సౌకర్యం, మరుగు దొడ్లు, పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజన నిర్వహణ అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయితీ సిబ్బందిచే పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థు లకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం ఇవ్వాలన్నారు. ఆయన వెం ట ప్రదానోపాధ్యాయురాలు వెంకటమ్మ, పంచాయితీ కార్యదర్శి నర్సింహాస్వామి, ఉపాధ్యాయులు మంజులతారెడ్డి, అంజలీ దేవి, భిక్షపతి, చక్రధర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన పారుశుధ్య చర్యలు చేపట్టాలి
వేములపల్లి: మండలంలోని ప్రతి పాఠశాలలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ పారిశు ధ్య మెరుగుకు ఉపాధ్యాయులు, గ్రామ పంచాయితీ సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలని డీపీవో విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన పరిశీలించి శానిటైజేషన్ చర్యలపై ప్రధానోపా ధ్యాయురాలు అరుణకుమారి, సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్ని అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణకు గతంలో నియమించిన స్కావెంజర్ను కొనసాగిస్తూ వారికి అవసరమైన వేతనాలను గ్రామ పంచాయితీ నుంచి అందించాలని సర్పంచ్, కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీ వో వెంకటేశ్వర్లు, కార్యదర్శి శ్రవణ్కుమార్, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.