చిలుకూరు, ఆగస్టు 5 : ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలకు వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. అనంతరం వైద్యం కోసం వచ్చిన వారిని ఆస్పత్రి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగిన సుడిగాలి వెంకటేశ్వర్లుకు రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. ఎంపీడీఓ ఈదయ్య, డాక్టర్ ప్రమోద్కుమార్, డీసీసీబీ డైరెక్టర్ కొండా సైదయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దొడ్డ సురేశ్, పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్, మాజీ జడ్పీటీసీ శివాజీనాయక్, సర్పంచులు వెంకటేశ్వర్లు, ఉపేందర్, నర్సయ్య, కడియాల వెంకటేశ్వర్లు, కొడారి రాంబాబు, పాల్గొన్నారు.