ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, ఆగస్టు 3 : సీఎం సహాయ నిధి పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పట్టణంలోని 1వ వార్డుకు చెందిన మౌనికకు రూ.42 వేలు, మండలంలోని మంగళతండాకు చెందిన ధారావత్ సాలమ్మకు రూ.22 వేలు, తేజావత్ మంగమ్మకు రూ.37 వేల చెక్కులను మంగళవారం ఆయన లబ్ధ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, పట్టణ సెక్రటరీ మేకపోతుల సత్యనారాయణ, రాష్ట్ర నాయకుడు వనపర్తి లక్ష్మీనారాయణ, వెంపటి మధుసూదన్, చిమిర్యాల మాజీ సర్పంచ్ శ్రీకాంత్, సత్యనారాయణ, మంగళతండా సర్పంచ్ పద్మ, జబ్బార్ ఉపసర్పంచ్ వాసు పాల్గొన్నారు.
కాన్వాసింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మానం
కోదాడటౌన్ : ది కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ను క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఈదా నాగిరెడ్డిని సన్మానించారు. అలాగే బుధవారం చిలుకూరులో నిర్వహించే ఉమ్మడి నల్లగొండ జిల్లా లారీ అసోసియేషన్ సమావేశానికి హాజరుకావాలని అసోయేషన్ నాయకులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చాప గోవిందరావు, ప్రధాన కార్యదర్శి కొత్త రాజారావు, కోశాధికారి అర్వపల్లి వెంకట శివ, సహాయ కార్యదర్శి గునుగుంట్ల సాయి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, చింతల వీరయ్య, వెంపటి మధు సూదన్, గట్ల కోటేశ్వరావు, మల్లికార్జున్, రఘు, లారీ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు పయిడిమర్రి వెంకటనారాయణ, ఆవుల రామారావు పాల్గొన్నారు.