కోదాడటౌన్, సెప్టెంబర్ 15 : సీఎం సహాయ నిధి నిరుపేదలకు ఆపత్కాలంలో అండగా ఉంటుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ పట్టణానికి చెందిన విశ్వనాథానికి సీఎం సహాయనిధి నుంచి రూ.36 వేలు మంజూరయ్యాయి. సంబంధిత చెక్కును క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన అందించి మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఖజారొద్దీన్, గుండపనేని నాగేశ్వర్రావు, గంధం పాండు, బత్తుల ఉపేందర్, ముస్తాఫా, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
గణేశ్ విగ్రహాల వద్ద పూజలు
24, 34వ వార్డుల్లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల వద్ద ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పూజలు చేసి అన్నదానం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, వంటిపులి నాగరాజు, కౌన్సిలర్లు మైసా రమేశ్, గుండెల సూర్యనారాయణ, మాదాల ఉపేందర్, డీసీసీబీ డైరెక్టర్ వీరస్వామి, యాదాద్రి, చింతల నాగేశ్వర్రావు, కట్టెబోయిన శ్రీను పాల్గొన్నారు.
నడిగూడెం : మండల కేంద్రంలోని సిరిపురం గ్రామంలో గణేష్ విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రామయ్యకు నివాళి
నడిగూడెం : బృందావనపురం ఎంపీటీసీ గోలి సునీతావెంకన్న మామ రామ య్య ఇటీవల మృతి చెందాడు. ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ గడ్డం నాగలక్ష్మీ మల్లేశ్యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సిరెడ్డి రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, దేవబత్తిని సురే శ్, దేవబత్తిని వెంకటనర్సయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.