హుజూర్నగర్, జూలై 9 : హుజూర్నగర్ నియోజకవర్గంలో పల్లె, పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం హుజూర్నగర్ మున్సిపాలిటీ 5, 8వ వార్డుల్లో కౌన్సిలర్లు మంగమ్మ, సౌజన్య అధికారులతో కలిసి మొక్కలు నాటారు. గరిడేపల్లి మండలం ఎల్బీనగర్లో వైకుంఠధామం పనులను ఎంపీపీ పెండెం సుజాత పరిశీలించారు. కోదండరామాపురంలో రోడ్ల వెంట పిచ్చి మొక్కలను తొలగించారు. పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. మఠంపల్లి మండలంలో అన్ని గ్రామాల్లో పాతబావులను పూడ్చడంతోపాటు మొక్కలు నాటారు. యాతవాకిళ్లలో గుంతలుగా ఉన్న వీధుల్లో మట్టి పోయించారు. చింతలపాలెం మండలం అడ్లూరు, కొత్తగూడెం గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాలకవీడు మండలం హన్మయ్యగూడెం, బొత్తలపాలెం గ్రామాల్లో డోజర్ సాయంతో వీధులు, రోడ్ల వెంట చెత్తను తొలగించారు. మేళ్లచెర్వు మండలం హేమ్లాతండాలో పల్లె ప్రగతి పనులను ప్రత్యేకాధికారి శ్రీధర్ పరిశీలించారు. డ్రై డేలో భాగంగా అన్ని గ్రామాల్లో మొక్కలకు పాదులు తీసి, నీరుపెట్టారు. కలుపు మొక్కలు, చెత్తను తొలగించారు. మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనారవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, ఎంపీడీఓలు ఇసాక్ హుస్సేన్, గ్యామానాయక్, జానకీరాములు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి : ఆర్డీఓ
హుజూర్నగర్ రూరల్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఆర్డీఓ వెంకారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బూరుగడ్డలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్తో కలిసి మొక్కలు నాటారు. పంచాయతీ కార్యాలయంలో ఇంటికి ఆరు చొప్పున మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ షేక్ సలీమా రంజాన్, ఎంపీడీఓ గంటా వరప్రసాద్, ఎంపీఓ షేక్ మౌలానా పాల్గొన్నారు.
కోదాడ నియోజకవర్గంలో..
కోదాడ, జూలై 9 : నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి పనులు పండుగలా సాగుతున్నాయి. కోదాడ పట్టణంలోని 35వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ.. వార్డు కౌన్సిలర్ కట్టెబోయిన జ్యోతీశ్రీనివాస్యాదవ్తో కలిసి ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం 18వ వార్డులో మొక్కలు నాటారు. వార్డు కౌన్సిలర్ కర్రి శివ సుబ్బారావు, కమిషనర్ నాగేంద్రబాబు, మేనేజర్ అంకుశావలీ పాల్గొన్నారు. కోదాడ మండలం తొగర్రాయిలో జరుగుతున్న పల్లెప్రగతి పనులను ఎంపీపీ చింతా కవితారెడ్డి, ఆర్డీఓ కిశోర్ కుమార్ పరిశీలించారు. పల్లె ప్రగతి పనుల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతగిరి మండలంలో జరుగుతున్న ప్రగతి పనులను ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు పరిశీలించారు. జడ్పీటీసీ కొణతం ఉమా శ్రీనివాస్రెడ్డి, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. మోతె మండలంలోని పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్రెడ్డి, ఎంపీఓ హరిసింగ్, సర్పంచులు పాల్గొన్నారు. చిలుకూరు మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఎంపీడీఓ ఈదయ్య, ఎంపీఓ నర్సింహారావు పనులను పరిశీలించారు. మునగాల మండల కేంద్రంలో ఎంపీపీ ఎలక బిందు మొక్కలను నాటారు. గణపవరంలో స్థానికులు వీధులను శుభ్రం చేశారు.
హరిత సంరక్షకులకు సన్మానం
ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని బాధ్యతగా పెంచి పచ్చదనానికి కృషి చేసిన కోదాడ పట్టణంలోని 30వ వార్డుకు చెందిన జిల్లా గ్రామీణాభివృద్ధి సహాయ సంచాలకుడు డాక్టర్ పెంటయ్య-జ్ఞానేశ్వరి దంపతులను కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ సన్మానించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలన్నారు. కౌన్సిలర్ పెండెం వెంకటేశ్వర్లు, కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబు, మేనేజర్ అంకుశావలీ, పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు, ఆలేటి చిన్న సత్యనారాయణ పాల్గొన్నారు.
పల్లె ప్రగతిలో భాగస్వాములు కావాలి
నడిగూడెం : పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పల్లె ప్రగతి విజిలెన్స్ అధికారి చక్రవర్తి అన్నారు. శుక్రవారం మండలంలోని రామాపురంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇంటికి ఆరు మొక్కలు నాటాలని సూచించారు. సర్పంచ్ బుజ్జా అనసూర్యమ్మ, నర్సింహారావు, నేలమర్రి పుష్పావతి, ఉమ, నాగమ్మ పాల్గొన్నారు.