హాలియా: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్లో 250 ఎకరాల్లో చేపట్టిన బుద్ధవ నం ప్రాజెక్ట్ను సుందర నందనవనం ప్రాజెక్టుగా తీర్చిద్ధామని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నా రు. బుద్ధవనం ప్రాజెక్ట్ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ నలుమూల లు నుంచి పర్యాటకులను ఆకర్షించే విధంగా బుద్ధ వనం ప్రాజెక్ట్కు తుది మెరుగులు దిద్దుతున్నామన్నారు.
తెలంగాణ బౌద్ధ వారసత్వాన్ని, ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ర్టాల్లోని బౌద్ధ కట్టడాలను, బుద్ధుని జీవిత చరిత్రకు సంబం ధిoచిన జాతక కథలను, బౌద్ధ చరిత్ర, బౌద్ధ పునర్జీవ చరిత్రలను పర్యాటకులకు వివరించడానికి తగు ఏర్పాట్లును చేపడు తున్నామన్నారు. బుద్ధవనం ప్రధాన ముఖద్వారాము, మహాస్థూపంపైన అలరించిన బౌద్ధ శిలాఫలకాల వివరాలనూ బౌద్ధ పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో బుద్ధవనం ప్రాజెక్ట్ ఎస్ఈ క్రాంతిబాబు, ఓఎస్డీ మధుసుధన్రెడ్డి, బుద్ధవనం డిజైన్ ఇన్చార్జి శ్యాంసుదర్ పాల్గొన్నారు.