శాలిగౌరారం: తమ వివాహేతర సంబంధం ఎక్కడ బయట పెడుతాడోనని అనుమానంతో ప్రియుడితో కలిసి మామను హత్య చేసిన దారుణ ఘటన మండల పరిధిలోని మాదారం కలాన్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి శాలిగౌరారం ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం లక్ష్మిదేవిగూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్య(60)తన కొడుకు, కొడలుతో కలిసి తమకు బ్రతుకుదెరువైన బాతులను తోలుకుని వచ్చి కొద్దిరోజుల క్రితం మాదారం గ్రామ శివారులోని చెరువు వద్ద గుడిసెలు వేసుకోని నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో శనివారం ముత్తయ్య కుమారుడు వేరే ఊరికి వెళ్లగా ఇదే అదునుగా బావించిన కొడలు శైలజ తన ప్రియుడు మహేశ్ను ఇంటికి పిలిపించుకుంది. వీరు ఇద్దరు కలిసి ఉండడాన్ని చూసిన ముత్తయ్య రేపు పొద్దుగాల పెద్దమనుషుల సమక్షంలో మీ ఇద్దరి సంగతి చూస్తానని అన్నాడు. విషయం బయటపడేలా ఉందని బావించిన కోడలు శైలజ, ప్రియుడి మహేశ్తో కలిసి ముత్తయ్యను అదే రోజు రాత్రి సమయంలో దిండు సాయంతో హత్య చేసినట్లు ఎస్ఐ వివరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.