శాలిగౌరారం: కులవృత్తుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. నీలి విప్లవం కార్యక్రమంలో భాగంగా బుధవారం శాలిగౌరారం ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కులవృత్తు లను నిర్వీర్యం చేశాయని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల వృత్తులకు పెద్దపీఠ వేసిందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతి కులానికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుం చి సీఎం కేసీఆర్ కులవృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, తద్వారా వారి కటుంబ సభ్యుల పిల్లలు ఉన్నత విద్యనభ్యసిస్తున్నార న్నారు. మత్స్యకారులకు భాగా లాభాలు వచ్చే రవ్వ, బొచ్చెతో పాటు ఫ్రాన్స్ సీడ్ను సైతం చెరువుల్లో వదిలేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు.
ప్రాజెక్టులో 8లక్షల చేప పిల్లలను వదలనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత, ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జ డ్పీటీసీ ఎర్ర రణీల, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కట్టా లక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్రెడ్డి, మామిడి సర్వయ్య, సర్పంచ్లు గౌర వీరయ్య, బట్ట హరిత, గుజిలాల్ శేఖర్బాబు, పడాల రాజు, గందశిరి వెంకన్న, పడాల సత్తయ్య, పొన్నెబోయిన వెంకన్న, కల్లూరి నాగరాజుగౌడ్ పాల్గొన్నారు.