అడవిదేవులపల్లి: ప్రభుత్వ పథకాలను మత్సకారులు వినియోగించుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీమతి చరిత అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీమతి చరిత ఆధ్వర్యంలో అడవిదేవులపల్లి మండల మత్స్యశాఖ సభ్యులకు, కృష్ణానది చేపల వేటగాళ్లకు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సంద ర్భంగా చరిత మాట్లాడుతూ ప్రభుత్వం మత్యకారులకు, ముదిరాజ్ల అభివృద్ధి కోసం వలలు, పుట్టీలు, వెహి కిల్స్ను 75 శాతం సబ్సిడీతో ఇస్తున్నారని వాటిని మండల ప్రజలు వినియోగించుకొని అభివృద్ధి చెందాలని తెలిపారు.
మత్స్యకారులకు అన్ని రకాల లైసెన్సులు ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు బొమ్మర బోయిన నాగేంద్ర అడవిదేవులపల్లి మత్స్యశాఖ చైర్మన్ చెన్నబోయిన సైదయ్య, మత్య్సశాఖ సభ్యులు బొమ్మరబోయిన రామారావు, పిల్లి వెంకటేశ్వర్లు, కేశబోయిన కొండలు, తుమ్మల ఏడుకొండలు పాల్గొన్నారు.