నార్కట్పల్లి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేయడం సరికాదని నకి రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును తప్పించుకోవడానికి చంద్రబాబు డైరెక్షన్లో ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని సూచించారు. మంగళవారం పట్టణ కేంద్రంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ డబ్బులతో పదవి కొనుక్కున్న రేవంత్ రెడ్డి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
తెలంగాణా బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన ఉనికిని కాపాడుకోవడానికే పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డు పడుతోందని, ముందు కేంద్రంపై పాదయాత్ర చేయాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను జనాలు ఆదరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ పీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, బలరాం, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, దూదిమెట్ల స్రవంతి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.