నల్లగొండ : జిల్లాలోని కొండమల్లేపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కెనాల్ 2వ దశ పనులపై అధికారులు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ రంగనాథ్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసు, స్థానిక ప్రజలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.