నల్లగొండ : నిన్న(బుధవారం) ముషంపల్లిలో వివాహితపై లైంగిక దాడికి పాల్పడి హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పలు ప్రజాసంఘాలు రాస్తారోకోకు మద్దతు తెలిపిన. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతకు ముందు వ్యాపార సంస్థలు మూసివేసి ఆర్యవైశ్యులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ రంగనాధ్ కి వినతిపత్రం అందజేశారు.