నల్లగొండ : విద్యుత్ తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) యల్లాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గడగోజు రామాచారి (36) స్థానికంగా ప్రైవేట్ విద్యుత్ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకొని విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి సబ్స్టేషన్ ఆపరేటర్ తప్పిదమే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహంతో సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.