నార్కట్పల్లి: మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని నార్కట్పల్లి, ఏడవల్లి, ఎనుగులదోరి గ్రామాలలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండలానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు రూ.19లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక 13వ వార్డులోని దుర్గామాత వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ పండుగలను శాంతియుతంగా నిర్వ హించుకోవాలని కోరారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతా యన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, యానాల అశోక్ రెడ్డి, మేకల రాజిరెడ్డి, పుల్లెంల ముత్తయ్య, సిరిపంగి స్వామి, పాశం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.