గరిడేపల్లి: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండ లంలోని అప్పన్నపేట గ్రామంలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం తగిన నిధులను మంజూరు చేస్తున్నదన్నారు. అదేవిధంగా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక వసతుల సాధనకు కృషి చేస్తానని, గ్రామాలను అనుసంధానం చేసే బ్రిడ్జిల నిర్మాణానికి, రైతుల సమస్యలను పరిష్కారించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాతగౌడ్, హుజూర్ నగర్ ఏఎంసీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, అప్పన్నపేట సర్పంచ్ చంద్రారెడ్డి, ఎంపీటీసీ కడప ఇసాక్, ఉప సర్పంచ్ ఎరగొర్ల విజయలక్ష్మి, వార్డు సభ్యులు మదార్, రేణుక, జానకిరాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గుర్రం వెంకటరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.