నల్లగొండ : నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించారు. 13 మంది నుంచి రూ. 6 కోట్ల విలువైన నకిలీ వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను స్వాధీనం చేసుకొని వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో నిందితులను ఐజీ స్టీఫెన్ రవీంద్ర మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడటంతో ఎక్కడి నుంచి జిల్లాకు వస్తున్నాయన్న దానిపై పోలీసులు దృష్టిసారించారు. ఆంధ్రప్రదేశ్లోని సరిహద్దు జిల్లాల నుంచి నల్లగొండకు నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నట్లు తెలుస్తున్నది.